టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరికి పెళ్లిలు అయిపోతున్నాయి. దగ్గుబాటి వారసుడు రానా మొదలుకుని, యంగ్ హీరో నితిన్, కార్తికేయ అందరు పెళ్ళి చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు. భార్యలతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కు మాత్రం పెళ్లి అవ్వటంలేదు. పోనీ ప్రయత్నిస్తున్నారా అంటే.. అబ్బే పెళ్లి ప్రస్తావన తెస్తేనే మండిపడుతున్నాడట ప్రభాస్. దీంతో వాళ్ళ అమ్మగారు కూడా ప్రభాస్ తో విసిగిపోయి డార్లింగ్ పెళ్లి బాధ్యతలను కృష్ణం రాజు అప్పజెప్పిన్నట్లు తెలుస్తుంది.

మొదటి నుండి ప్రభాస్ కి పెద్దాయన అంటే  గౌరవం, ఇష్టం, అభిమానం, ప్రేమ..దీంతో ఆయన చెప్పిన మాటను వింటాడు అనే నమ్మకం ఉంది అందరికి. మరి పెద్దాయన ప్రభాస్ కోసం ఎలాంటి అమ్మాయిని తీసుకువస్తారో అని అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ రూమర్ ఏదైన ఉంది అంటే అది ప్రభాస్-అనుష్క పెళ్లి మ్యాటర్. వీళ్ల జోడీ బాగుంటుంది. తెర పై వీళ్ల కెమిస్ట్రీ బాగా పండుతుంది. అభిమానులకు వీళ్ల జంట అంటే పిచ్చ ఇష్టం. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారితే చూడాని అభిమానులతో పాటు..టాప్ సెలబ్రిటీ కూడా చూస్తున్నారు. కానీ వీళ్లు మాత్రం మా మధ్య అలాంటి సంబంధం ఏం లేదు..మేం ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ వీళ్లు చేసే కొన్ని పనులు మాత్రం వీరు ఒకరినిఒకరు ఇష్టపడుతున్నారు అనేలా ప్రోజెక్ట్ అవుతున్నాయి.

కాగా గత కొంత కాలంగా అనుష్క-ప్రభాస్ దూరంగా ఉంటున్నట్లు టాక్ ఉంది. దానికి కారణం కృష్ణం రాజు నే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో ప్రభాస్ ని  కలిసిన అనుష్క..ఆయనను కృష్ణం రాజు ఫ్యామిలీ అందరి ముందు గట్టిగా హగ్ చేసుకుని..క్లోజ్ గా మూవ్ అయ్యిందట. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో అలా హగ్ చేసుకోవడం కామన్ నే. కానీ అది ఫ్యామిలీ ఫంక్షన్ అయ్యే సరికి కృష్ణం రాజు కు కోపం వచ్చిందట. దీంతో ఇంకోసారి ఇలా చేయకు అంటూ గట్టిగానే చెప్పారట. దీంతో అప్పటి నుండి అనుష్క ప్రభాస్ తో దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: