నందమూరి ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ కి ఇంత ఇమేజ్ ను తీసుకు రావడానికి కారణం నందమూరి ఫ్యామిలీ వంశవృక్షం అయిన నందమూరి తారకరామారావు అని చెప్పవచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ కు రప్పించిన ఘనత నందమూరి తారక రామారావు ది. కటిక పేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన నటనతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయాడు.. అంటే ఆయన నటనా చాతుర్యం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేవలం తొమ్మిది నెలల కాల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. అంటే ఇక ఆయన పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఎంతో మంది సినిమా ప్రేక్షకులను, ప్రజలను తన మంచి మనసుతో మెప్పించిన  నందమూరి తారకరామారావు.. ఆ తర్వాత తన వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా మొదటి సారి నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాతో దేశవిదేశాలలో తన పేరును మారు మ్రోగేలా నమోదు చేసుకుంటున్నారు.

అఖండ సినిమాతో తన మాట నిలబెట్టుకున్నాడు నందమూరి బాలకృష్ణ. మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఇకపోతే నందమూరి వారసులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించగా ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరొక వారసుడు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. బాలకృష్ణ తండ్రిగా తన బాధ్యతను నిలబెట్టుకున్నాడు. ఇక అబ్బాయిలు ఇద్దరూ.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ మాటలను నిలబెట్టుకుంటారో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: