రెండు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి ఏమైందో తెలియదు కానీ వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చింది మొదలు ఇప్పటి వరకు ఎంతో మంది రకరకాల సమస్యలతో మరణించడం సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఈ వారంలోనే సుమారుగా మూడు మృతదేహాలు చూసిన మనం ఇప్పుడు మరొక సారి షాక్ కి గురి కావలసి వస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మరణించిన విషయాన్ని జీర్ణించుకోకముందే ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా స్వర్గస్తులయ్యారు.

ఇకపోతే యంగ్ హీరోగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజిల రెడ్డి కూడా రోడ్ యాక్సిడెంట్ లో మరణించాడు. ఇవన్నీ మర్చిపోకముందే ఇప్పుడు మరొక ఒక బాలీవుడ్ నటుడు మరణించిన వార్త తెలిసి ప్రతి ఒక్కరిలో కలవరం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన బ్రహ్మ మిశ్రా.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. ఇక ముంబైలోని వెర్సోవా లోని ఒక అపార్ట్మెంట్లో  తన ఫ్లాట్ లో మిశ్రా శవమై ఉండడాన్ని స్థానికులు గుర్తించి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.అంతేకాదు కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం వుండడం చూసి స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు వెంటనే శవాన్ని పోస్టుమార్టం కొరకు డాక్టర్ కూపర్ హాస్పిటల్ కి పంపించారు. ఆయన ఒంటిపై గాయాలు అయినట్లు పోస్టుమార్టంలో తేలింది. బాలీవుడ్ మీడియా వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం మిశ్రా ది హత్యా లేక ఆత్మహత్యా అనే తెలియాల్సి ఉంది.. మిశ్రా స్నేహితులందరూ అతనికి శత్రువులు ఎవరూ లేరు..తను అందరితో చాలా సంతోషంగా కలిసిపోయే వ్యక్తి అని చెబుతూ ఉండటం గమనార్హం. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్లో మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: