టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా రూపొందుతోంది. పరశురామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో పోషించని ఒక డిఫరెంట్ రోల్ చేస్తుండగా ఆయన కు జోడీగా కీర్తి సురేష్ యాక్ట్ చేస్తుంది. ఇటీవల స్పెయిన్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట యూనిట్, కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో మరొక షెడ్యూల్ ని కంప్లీట్ చేసింది.

అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో యూనిట్ విశాఖపట్నం వెళ్లనుంది అని, అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతరం సినిమా మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు సినిమాల తో పాటు అటు పలు బ్రాండ్స్ ని కూడా ఎండార్స్ చేస్తూ మరింత భారీ స్థాయి క్రేజ్ దక్కించుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో ప్రస్తుతం మరొక ప్రెస్టీజియస్ బ్రాండ్ వచ్చి చేరింది.

గతంలో థమ్సప్ కి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న సూపర్ స్టార్, ప్రస్తుతం మరొక శీతలపానీయం మౌంటెన్ డ్యూ కి అంబాసడర్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఇటీవల మహేష్ పై ఆ సంస్థ వారు ఒక లేటెస్ట్ యాడ్ చిత్రికరించినట్లు తెలుస్తోంది. కాగా కొద్దిసేపటి క్రితం తన ఖాతాలో మరొక సరికొత్త బ్రాండ్ వచ్చి చేరింది అంటూ మౌంటెయిన్ డ్యూ యాడ్ లోని ఒక పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు సూపర్ స్టార్. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మరోవైపు సర్కారు వారి పాట షూట్ త్వరలో కంప్లీట్ చేయనున్న మహెష్ బాబు, ఆపైన త్రివిక్రమ్ సినిమా మొదలెట్టనున్నారు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో కూడా సూపర్ స్టార్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: