సెలబ్రిటీలతో ఎక్కువ వడ్డీ ఇప్పిస్తామంటూ.. సమాజంలో పేరు ఉన్న వ్యక్తులతో పాటు ఇండస్ట్రీ వాళ్లను కూడా మోసం చేస్తూ బాగా పాపులర్ అయింది వ్యాపారవేత్త శిల్పా చౌదరి. ఈమె ఇప్పటివరకు రెండు వందల యాభై కోట్లకు పైగా టోపీ పెట్టినట్లు సమాచారం. ఈమె బారిన పడిన వారిలో స్టార్ హీరో మహేష్ బాబు సోదరి అలాగే హీరో సుదీర్ బాబు భార్య అయిన ప్రియదర్శిని కూడా ఉన్నది. ఈమె దగ్గర 2.9 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈమె పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఇక అసలు విషయంలోకి వెళితే ఈమె బారిన మరొక యంగ్ హీరో కూడా పడినట్లు సమాచారం.."సెహరి"అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు హీరో హర్ష కనుమిల్లి. ఇక ఈ హీరోతో శిల్ప చౌదరి స్నేహం చేసి.. స్థలం ఉంది కొంటారా అంటూ కొంత డబ్బుని తీసుకున్నదట.. ఇలా తన దగ్గర నుంచి దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు లాగేసుకున్నదని సమాచారం. అయితే ఈమె గురించి తాజాగా తెలియడంతో ఇక తన డబ్బు రావని తెలుసుకొని.. శిల్పా చౌదరి మీద కంప్లైంట్ ఇచ్చాడు హర్ష.
ఇక ఈ యువ హీరోనే కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది టాప్ పొజిషన్ లో ఉన్న హీరోలు కూడా మోసపోయినట్లు సమాచారం. అయితే ఈ సమస్యలన్నిటినీ కేవలం వారే స్వయంగా పరిష్కరించుకుంటూ ఉన్నట్లుగా సమాచారం.