టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో అడివి శేష్ కూడా ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ పాత్రల్లో మంచి నటనను కనబరిచి.. ఆ తర్వాత హీరోగా విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం, గూడచారి వంటి స్మాల్ బడ్జెట్ సినిమాల తోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇదిలా ఉంటే తాజాగా ఈ యంగ్ హీరోకి భారీ గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అప్ డేట్ ని అడవిశేషు స్వయంగా ప్రేక్షకులతో పంచుకున్నాడు. తాజాగా ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయిన అడవి శేష్..

 తను నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ తెలుగుతో పాటు తనకు తాజాగా బాలీవుడ్ సినిమాలో కూడా ఒక ఆఫర్ వచ్చిందని వెల్లడించాడు.' ఇప్పటికే నేను నా నెక్స్ట్ రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేశాను. త్వరలోనే ఆ రెండు సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన చేస్తాను' అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అడవి శేషు. చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఆఫర్ ను అందుకోవడం అంటే విశేషమని చెప్పాలి. ఇక ప్రస్తుతం అడవి శేష్ 'మేజర్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. సోనీ పిక్చర్స్, జి ఎం బి క్రియేషన్స్, ఏ ప్లస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు, హిందీ రెండు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని చిత్రీకరించి ఆ తర్వాత మలయాళం లోకి డబ్ చేస్తున్నారు. 2008వ సంవత్సరంలో ముంబై దాడుల అమరవీరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో అడవి శేషు తో పాటు శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శశికిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: