టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న భీమ్లా నాయక్ కి స్క్రిప్ట్, డైలాగ్స్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా యువ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న  ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్న ఈ మూవీ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ గా అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి కీలకమైన అడవి తల్లి మాట అనే పల్లవితో సాగే నాలుగవ సాంగ్ ని రేపు ఉదయం 10 గం. 8 ని. లకు రిలీజ్ చేయనుంది యూనిట్.

భీమ్లా నాయక్ సినిమా సినిమా సారాంశాన్ని తెలియచెప్పే విధంగా సాగే ఈ సాంగ్ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటుందని, అలానే సాంగ్స్ రిలీజ్ తరువాత త్వరలో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనుందట యూనిట్. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న భీమ్లా నాయక్ మూవీ తప్పకుండా సూపర్ హిట్ కొట్టి తమందరికీ ఎంతో మంచి పేరు తెస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తొలిసారిగా పవర్ స్టార్ తోదగ్గుబాటి వారసుడు రానా కలిసి యాక్ట్ చేస్తున్న ఈ భీమ్లా నాయక్ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: