సాయి పల్లవి..చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి..స్టార్ హీరోల కళ్లు ఆమె పై పడేలా చేసుకున్న మళయాళి బ్యూటి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి పాత్రలలోనైనా లీనమైపోయి నటిస్తుంది ఈ నేచురల్‌ బ్యూటీ. కేవలం అందం, అభినయంతోనే కాకుండా తనదైన నటనతో, ముఖ్యంగా డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను ఫిదా చేసిన రౌడీ బేబీ.

ఇక సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్‌ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. పూజా కన్నన్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘చిత్తారాయి సెవ్వనం’. ఈ సినిమా  జీ5 ఓటీటీలో నిన్నటి నుండి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటుడు, డైరెక్టర్‌ సముద్ర ఖని ప్రధానపాత్రలో కనిపించగా.. సినిమాల్లో ఫైట్‌మాస్టర్‌గా  ఉన్నటువంటి సిల్వ ఈ సినిమాను డైరెక్ట్ చేసి దర్శకుడిగా మారాడు. కాగా తన చెల్లెలి సినిమా గురించి సాయి పల్లవి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టగా ..అది కాస్త వైరల్ గా మారింది.

సాయి పల్లవి పోస్ట్ ఆధారంగా.."పూజా.. నీ గురించి నాకు బాగా తెలుసు. నాకు మాత్రమే తెలిసిన నిన్ను ఇప్పుడు ప్రపంచం కూడా తెలుసుకోనుంది.  ‘చిత్తారాయి సెవ్వనం’ సినిమాతో నువ్వు సినీ  ప్రపంచంలోకి అడుగుపెట్టావు. మనం సినిమాలో కనిపిస్తే ఆ ఆనందం వేరే గా ఉంటుంది. అదే సినిమాను ప్రజలు ఆదరిస్తే  ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అభిమానులు కురిపించే ప్రేమలో తెలియని కిక్ ఉంటుంది. ఇక నన్ను ఎలా సపోర్ట్ చేసారో అలాగే నా చెల్లిని ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలు నా చెల్లి పై కూడా కురిపించాలని కోరుకుంటున్నా.   ఐలవ్యూ డియర్‌.. ఒక అక్కగా నా సపోర్ట్‌ నీకు ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను పూజా" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: