ఇక సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. కానీ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం . ఒకరు అల్లు అర్జున్ .. మరొకరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇక ఈ కారణంగానే ఆయన అడగ్గానే మళ్ళీ రైటర్ గా మారిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. యస్.. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా భీమ్లా నాయక్.
పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఇందుకు గాను ఆయన అందుకున్న పారితోషకం చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా 15 కోట్లు చార్జ్ చేసాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్ భార్య గా కనిపించనుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12 న మన ముందుకు రాబోతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి భారీ విజయాని నమోదు చేస్తుందో..!!