రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఎంతో ఆకట్టుకోగా ట్రైలర్ ని త్వరలో విడుదల చేయనున్నారు.

అయితే దీనితో పాటు అటు నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కే, ప్రశాంత్ నీల్ తో సలార్, ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాలు కూడా ప్రభాస్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే వీటిలో ఆదిపురుష్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా, ప్రస్తుతం సలార్ షూట్ జరుగుతోంది. కాగా నాగ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న ప్రాజక్ట్ కె మూవీ కి సంబంధించి ఇటీవల హీరో, హీరోయిన్స్ లేకుండా కొన్ని సన్నివేశాలు తీయగా రేపటి నుండి హీరోయిన్ దీపికా పదుకొనె, హీరో ప్రభాస్ లపై సీన్స్ తీయనుందట యూనిట్.

ఇక తమ సినిమాలోకి సాదరంగా హీరోయిన్ దీపికా కి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ క్వీన్ దీపికా అంటూ మన తెలుగు ఆడపడుచుల సాంప్రదాయ గాజులు, పసుపు, కుంకుమ పువ్వుల్ని ఆమెకి కానుకగా పలుకుతూ ఆహ్వానం పలికారు నిర్మాతలు. అయితే ఆ ఆహ్వాన పత్రిక, వస్తువులను నిర్మాతలైన వైజయంతి మూవీస్ వారు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక యువ సైంటిస్ట్ గా కనిపించనున్నారు అనేది ఫిలిం నగర్ వర్గాల టాక్ కాగా ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని వీలైనంతగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: