టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు.. ఎందరో అమ్మాయిల కలల రాజకుమారుడు . తండ్రికి  తగ్గ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో ఎటువంటి గొడవలకు, కాంట్రవర్సీలకు పోకుండా లైఫ్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో "సరిలేరు నీకెవ్వరు" అంటూ వచ్చిన సినిమా టాలీవుడ్ బాస్ ఆఫిస్స్ వద్ద ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమా తరువాత మహేష్  డైనమిక్ డైరెక్టర్ పరశూరాం దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమాలో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ పక్కన మొదటిసారి మహానటి గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

నిజానికి ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేద్దాం అనుకున్నారు మేకర్స్. కానీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమా జనవరి 7న రిలీజ్ కానుండడంతో కలెక్షన్స్ పరంగా సినిమాకు దెబ్బపడుతుందని భావించి మేకర్స్ మహేష్ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఇక సినిమా రిలీజ్ కు బోలెడు టైం ఉన్నా కూడా..బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షోకి గెస్ట్ గా వచ్చారు మహేష్.

ఇక కొద్ది రోజుల ముందే  ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో సంద‌డి చేసిన  మహేష్ .. రీసెంట్ గా బాలయ్య టాక్ షో లోను తనదైన స్టైల్లో అల్లరి చేసారు. ఇక ఈ షోను హోస్ట్ చేస్తున్న బాలయ్య..మహేష్ బాబు ను కొన్ని ఫన్నీ ప్రశ్నలు వేసిన్నప్పుడు వాటిలో ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పకుండా తప్పించుకునేందుకు ట్రై చేస్తుంటే..బాలయ్య సరదాగా నమ్రతకు చెప్పమంటావా అంటూ అన్నారట. దీంతో మహేష్ పక పక్కా నవ్వుతూ ఫైనల్ గా ఆన్సర్ ఇచ్చారట. ఇక ఈ టాక్ షోకి సంబంధించి మ‌హేష్ బాబు, బాల‌కృష్ణ   పిక్స్ కొన్ని బ‌య‌ట‌కు రావడంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: