పూజా హెగ్డే.. ఈ పేరు చెప్పగానే కుర్రాళ్ళ గుండెల్లో ఒక తెలియని అనుభూతి ఏర్పడుతుంది. అయితే ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక పారితోషికం విషయంలో కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా స్టార్ హీరోల రేంజ్లో తీసుకుంటోంది. కొన్ని సినిమాలు అయితే ఏకంగా ఆమె మీదే, సినిమాలు నడవడం గమనార్హం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పూజా హెగ్డే మొదటి సంపాదన గురించి నెట్లో తెగ సెర్చింగ్ చేశారట. ఆమె పారితోషికం కేవలం 300 రూపాయలు అన్నట్లు ఆమె ఒకానొక సమయం లో ఆమె స్వయంగా తెలపడంతో పాటు కొన్ని కొన్ని విషయాలను కూడా పంచుకుంది.పూజా హెగ్డే మాట్లాడుతూ.. మిస్ ఇండియా కోసం..ఫోటోల కోసం మొదటిసారి పోర్ట్ పోలియో ఫోటోలు దిగిందట. ఇక అప్పటి వరకు వాటి గురించి ఆమెకు అస్సలు తెలియదు అని సమాచారం. ఇక మొదటిసారి ఈమె చేసిన ప్రకటన ఏమిటంటే రన్బీర్ కపూర్ తో స్కూటీ యాడ్ కోసం రన్ బీర్ కపూర్ తో కలిసి నటించింది.. అంతేకాదు తొలి అంతర్జాతీయ ట్రిప్ ఆమెకు థాయిలాండ్ అట. తన కుటుంబం అంతా కలిసి కొన్ని రోజులు అక్కడ కూడా సరదాగా గడిపి వచ్చారని ఈ విషయాన్ని పూజ తెలిపింది.

ఇక మొదటి సారి ఈమె  బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్ చూసి భలే ఉంది దీనిని ఎలా అయినా సరే కొనాలి అని అనుకునేదట. కాని ఎట్టకేలకు కొనేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె చిన్నప్పుడే కొరియోగ్రఫీ నేర్చుకుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె తాతగారు క్రీడా సంస్థ కోసం సర్టిఫికెట్లను కూడా రాయించేవారు అట. రాయించుకున్న తర్వాత 300 రూపాయలు ఇచ్చేవారట. పూజ హెగ్డే తొలి సంపాదన ఇదే కావడం గమనార్హం. ఇక టీనేజర్ గా మొదటిసారి మోడలింగ్ చేసి ఐదు వేల రూపాయలను చెక్కులు అందుకున్నదట ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు స్కూల్ లో టీచర్స్ డే రోజు మొదటిసారి వాళ్ళ అమ్మ చీర కట్టుకొని స్కూల్ కి వెళ్ళింది అట. ఈ విషయాలన్నీ పూజ స్వయంగా వెల్లడించింది

మరింత సమాచారం తెలుసుకోండి: