దివంగత లెజెండరీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్ను మూసి సినిమా ప్రపంచంలోని అందరినీ శోక సంద్రంలో ముంచేశారు. ఆయన మరణంలో ఒక శకం ముగిసిందని, సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయన లేని లోటు తీరనిది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా "ఇదే నా చివరి పాట" అంటూ చనిపోయే ముందు ఓ డైరెక్టర్ తో సిరివెన్నెల చెప్పినట్టు సమాచారం.  

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఎపిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ "శ్యామ్ సింఘా రాయ్" ఈ చిత్రం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమా థర్డ్ సింగిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడానికి ఒక వీడియో బైట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఉన్న ఆయన కొన్ని విషయాలను రివీల్ చేశారు. ఇది చిత్ర బృందానికి, సంగీత ప్రియులకు చాలా ప్రత్యేకమైంది అని ఆయన అన్నారు.

శ్యామ్ సింగ రాయ్ "సిరివెన్నెల" పాటను సిరివెన్నెల రాశారు. ఇదే ఆయన చివరి పాట. ఈ విషయాన్నీ స్వయంగా మేకర్స్ తెలియజేశారు. “డిసెంబర్ 3వ తేదీన సిరివెన్నెల నాకు ఫోన్ చేసి తన అనారోగ్య పరిస్థితిని వివరించారు. దాని కారణంగా పాటను పూర్తి చేయలేకపోయానని చెప్పారు. సాంగ్ కోసం వేరే రచయిత కోసం వెతకమని అన్నారు. కానీ సిరివెన్నెలతోనే పాటను పూర్తి చేయాలనీ భావించాము. దీపావళి రోజున ఉదయం ఆయన నన్ను లేపి పల్లవిని నోట్ చేసుకోమని చెప్పారు. అదే తన చివరి పాట కావచ్చని చెబుతూ గట్టిగా నవ్వేశారు" అని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అన్నారు.

హీరో నాని శ్యామ్ సింగరాయ్‌ని సిరివెన్నెల గారికి అంకితం చేస్తున్నామని తెలిపారు. పాట విషయానికి వస్తే మిక్కీ జె మేయర్ ట్యూన్ చేసిన సోల్ ఫుల్ మెలోడీ సాంగ్ ఇది. అనురాగ్ కులకర్ణి పాడగా, సిరివెన్నెల గీతాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

 



మరింత సమాచారం తెలుసుకోండి: