నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా లో ముద్దు గుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్య పాత్ర లో పూర్ణ నటించింది. ఈ సినిమా లో  విలన్ పాత్రలో శ్రీకాంత్ కనిపించాడు, బాలకృష్ణ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమా మూడవది, ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.  అఖండ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో హైడ్రిక్ మూవీ కావడం తో ఈ సినిమా పై జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు, అయితే డిసెంబర్ 2 వ తేదీన విడుదలైన ఈ సినిమా అలా ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను నెరవేరుస్తూ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి, కలెక్షన్ల వర్షం కురిపిస్తు, బ్లాక్ బస్టర్ దిశ గా దూసుకుపోతుంది.

 ఇది ఇలా ఉంటే తాజా గా అఖండ సినిమా కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది,  అఖండ సినిమా సూపర్ హిట్ సక్సెస్ దిశ గా దూసుకుపోతున్న సందర్భం గా అఖండ చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈ నెల 8 వ తేదీ న చేయాలి అని భావిస్తుండగా, ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు,  జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది, ఇప్పటికే అఖండ సినిమా గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు, ఈ నేపథ్యం లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు అఖండ సినిమా సక్సెస్ మీట్ కు వస్తారు అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: