నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి నాలుగు రోజులకే ఏకంగా 40 కోట్లకు పైగా షేర్ ని రాబట్టి సంచలనాన్ని సృష్టించింది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలలో తన నట విశ్వరూపాన్ని చూపించారు.ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేసాడు. అయితే ఈ సినిమాలో  అఘోర పాత్రకు హీరోయిన్ అవసరం లేకపోయినా బాలయ్య నటించిన మురళీకృష్ణ అనే మరో పాత్ర కోసం హీరోయిన్ అవసరం అయింది.

ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర ఒకటి రెండు పాటలతో ఫస్టాఫ్ వరకు మాత్రమే పరిమితమైన కానీ బోయపాటి శ్రీను చాలా తెలివిగా బాలయ్య అభిమానులను దృష్టిలో పెట్టుకుని ప్రగ్యా జైస్వాల్ నీ హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఇక సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్గా, మురళీకృష్ణ భార్యగా మంచి నటనను కనబరిచింది. అయితే ఈ సినిమాకి ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ప్రగ్యా కంటే ముందు కొంతమంది హీరోయిన్లను సంప్రదించిన బోయపాటి చివరగా ఈమెను సెలెక్ట్ చేసారట. ఇక అఖండ సినిమాకి ముందుగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్, కేథరిన్ వంటి హీరోయిన్లను సంప్రదించారట బోయపాటి శ్రీను.

 కానీ ఆ హీరోయిన్లంతా ఏవేవో కారణాలు చెప్పి అఖండ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో చివరగా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాకు హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఈ సినిమాలో తన పాత్ర మేరకు ఆమె మంచి నటనను కనబరిచింది. ఇక అఖండ సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం మొత్తం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇదే కావడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత అఖండ సినిమాతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంతో చిత్ర యూనిట్ గ్రాండ్గా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన అఖండ సక్సెస్ మీట్ ని నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: