ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో రౌద్రం రణం రుదిరం' అనే భారీ పాండియన్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో 'భీమ్లా నాయక్' అనే మరో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఇక గతంలో విక్టరీ వెంకటేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..

 తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయట పెట్టాడు. బుల్లితెరపై గతంలో బిగ్ బాస్ షో తో పోస్ట్ గా అలరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో తో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ హాజరు కాగా.. ఇక ఈ సీజన్ కు చివరి ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా విచ్చేశారు. డిసెంబర్ 5న జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్, మహేష్ బాబుల మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్యామిలీ రిలేషన్స్, పిల్లలతో తనకున్న అనుబంధం గురించి మహేష్ బాబు..

ఈ షోలో ఎన్టీఆర్తో పంచుకున్నాడు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఉన్న బంధం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఈ జనరేషన్ హీరోలంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారని అన్నాడు. అంతేకాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడం తనకు కూడా ఇష్టమే అని చెప్పిన మహేష్.. గతంలో కూడా మనిద్దరం ఈ విషయం గురించి మాట్లాడుకున్నామని, కానీ ఆ తర్వాత ఇద్దరం బిజీ అవ్వడం వల్ల అది కుదరలేదని ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ మహేష్ బాబు అన్నాడు. ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేయాలని వద్దని చెప్పిన మహేష్ బాబు రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మల్టీస్టారర్ సినిమాలను చూడబోతున్నారు' అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: