విజయవంతమైన తెలుగు ఓటీటీ ఆహాకు మారుతి లాంటి ఆడియెన్స్ పల్స్ తెల్సిన డైరెక్టర్ తోడైతే ఎలాంటి విజయాలు వస్తాయో మంచి రోజులు వచ్చాయి మరియు 3 రోజెస్ ప్రాజెక్ట్స్ నిరూపించాయని తెలుస్తుంది

ఈ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ నేపథ్యంలో సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్ టైనర్ మారుతి ఈవెంట్ నిర్వహించారట.. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మారుతి మరియు హీరో సంతోష్ శోభన్ అలాగే ఆహా సీయీవో అజిత్ ఠాకూర్ మరియు హీరోయిన్ ఈషా రెబ్బ, నిర్మాత ఎస్ కే ఎన్, హీరోయిన్ పూర్ణ, నటి హేమ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారని సమాచారం.

ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ…అనేక కోరికలతో మరియు ఆశలతో ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారని అలాంటి వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న గ్రేట్ ప్లాట్ ఫామ్ ఆహా అన్నారట సంతోష్. అలాగే మారుతి అన్నతో పనిచేసే అవకాశం నా కెరీర్ లో చాలా త్వరగా రావడం అదృష్టంగా భావిస్తుంటానని ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నానని అన్నారట.మంచి రోజులు వచ్చాయి సినిమా నాకొక లర్నింగ్ ఎక్సీపిరియన్స్ అని మా సినిమాకు బెస్ట్ టీమ్ కుదిరింది అని చెప్పుకొచ్చాడట ఈ యంగ్ హీరో..

అలాగే దర్శకుడు మారుతి మాట్లాడుతూ… నా కోసం మాస్ ఎంటర్ టైనర్ అనే ప్రోగ్రాం పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అన్నారట. కానీ నేనేంటో నేనేం చేయగలనో ఎప్పుడూ మర్చిపోనని ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అఖండ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారని రాబోయో సినిమాలకు కూడా ఇదే ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా అని మారుతి అన్నారట. మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి టైమ్ లో రిలీజ్ చేసినప్పుడు థియేటర్ ఎక్సీపిరియన్స్ కోరుకున్న వాళ్లు థియేటర్ కు వెళ్లారు ఓటీటీ కోసం వేచి చూసేవారు ఆగారని తెలుస్తుంది.. ఇప్పుడు ఆహాలో మంచి రోజులు వచ్చాయి స్ట్రీమింగ్ మొదలవగానే చూడని వాళ్లంతా చూస్తున్నారని మాకైతే సినిమా చేసిన రోజులన్నీ మళ్లీ రీకాల్ అయ్యాయని ఆహా లాంటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా పెరుగుతోందని ఆహాను నిలబెట్టేందుకు టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసని అందుకే ప్రతి ఒక్క తెలుగు వారు ఇది మన ఓటీటీ అని భావించండి అంటూ నెక్ట్ ఇయర్ ఇంకో ప్రోగ్రాం ఆహాకు చేస్తాను అని చెప్పుకొచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: