ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న పుష్ప మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముగ్గురు స్టార్ హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ లను ఆ చిత్ర యూనిట్ ఆహ్వానించిందట. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ తీసుకురావడానికి స్టార్ హీరోలను గెస్ట్ లుగా పిలిచినట్టు తెలుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మూవీ పుష్ప. ఇప్పటికే సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్ టీజ్ తో ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించి మొన్నటికి మొన్న పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూసిన చూపులకు తెరపడింది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ట్రైలర్ వచ్చేసింది. సాయంత్రం 6గంటలకే విడుదల చేస్తామని తొలుత ప్రకటించినా కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే తాజాగా ట్రైలర్ విడుదల చేసి అభిమానులకు చిత్రయూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది ఈ చిత్రం. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ప్రత్యేక పాత్రలో అనసూయ సందడి చేయనుంది. ఈ నెల 17న సినిమా రిలీజ్ కానుంది.

అంతేకాదు పుష్ప టీమ్ నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్.. టీమ్ కు ఓ విజ్ఞప్తి చేశాడు. అందరూ ఎవరి ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు తీసుకొచ్చి డస్ట్ బిన్ లో వేయాలని చెప్పాడు. మనం వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉందో అలాగే నీట్ గా మనం చేసి బయటకు వెళ్లిపోవాలి అని చెప్పాడు.










 

మరింత సమాచారం తెలుసుకోండి: