జెమినీ టీవీలో ప్రసారమయిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో గత కొన్ని రోజులుగా అభిమానులను అలరించిందట . జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో..

తొలి సీజన్‌ ఆదివారంతో ముగిసిందట. చివరి ఎపిసోడ్‌కు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు అతిథిగా వచ్చారట.. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను జెమినీ టీవీ ప్రీమియర్‌గా ప్రదర్శించిందట.. ఇద్దరు స్టార్‌ హీరోలు బుల్లితెరపై కనిపించడంతో తెలుగు అభిమానులు ఆనందంలో మునిగిపోయారట.. మహేష్ ఈ గేమ్ షోలో కనిపించడం ఇదే తొలిసారి కాగా ఎన్టీఆర్‌ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ రూ.25లక్షలు గెలుచుకున్నారని తెలుస్తుంది.. ఇక ప్రశ్నల మధ్య మధ్యలో సూపర్‌స్టార్‌ తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలు కొన్నింటిని పంచుకున్నారట..

మహేష్ బాబుని హాట్ సీట్‌పై కూర్చో బెట్టిన ఎన్టీఆర్‌ సమయానుసందార్భంగా పలు ప్రశ్నలు అడిగారట.. మీరు సెలవులను బాగా ఎంజాయ్ చేస్తారు కదా కరోనా భయాందోళనల మధ్య మహేష్ విహారయాత్రకు ఎలా వెళ్తాడోనని ఆందోళన చెందుతున్నా అని తారక్ అనగా.. 'నిజమే. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతానని పిల్లలతో ఏడాదికి మూడు వెకేషన్స్ ప్లాన్ చేస్తా దాంతో పిల్లలు మరియు మా మధ్య బంధం బలోపేతం అవుతుంది' అని మహేష్ చెప్పారట.. సినిమాలతో పాటు కుటుంబంతో గడపడానికి మహేష్ ఇష్టపడుతారట.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా షూటింగ్ మధ్యలో ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తారట.సూపర్‌స్టార్‌.


మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితార తో ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పారట. సితార గురించి చెప్పండి అని జూనియర్ ఎన్టీఆర్ అడగ్గా.. 'తనతో నా అనుబంధం రోజు రోజుకీ పెరుగుతుందని సీతారతో ఉన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తనతో నాకు ప్రతి దశలో వేర్వేరు బంధాలు ఉన్నాయని 1-3 సంవత్సరాలలో ఓ బంధం, 3-5లో ఇంకోలా ఉందట ప్రతి ఏడాదికి బంధం మారుతూ ఉంటుందట తండ్రికి అప్‌గ్రేడేషన్ అవసరం' అని ప్రిన్స్ సమాధానం ఇచ్చారట.ఇది విన్న ఎన్టీఆర్ మహేష్ బయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందన్నారట. కూతుళ్లు ఉన్నవాళ్లను చూసి తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని అన్నారటతనకు ఇద్దరూ కొడుకులే అని కూతుళ్లు లేకపోవడం వెలితిగా ఉందన్నారట.

షో మధ్యలో సంగీతం ప్రస్తావన రావడంతో.. తాను చిన్నతనంలో వీణ బాగా వాయించేవాడినని, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడంతో వీణ వాయించే సమయం దొరకడం లేడి మహేశ్‌ బాబు తెలిపారట.. 'ఒక్కడు' సినిమా పాటలు అంటే తనకు చాలా ఇష్టమని సమయం దొరికినప్పుడల్లా ఆ పాటలను వింటూ ఎంజాయ్‌ చేస్తానని మహేష్ చెప్పారట.ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా గురించి మహేశ్‌ స్పందించారట.ఆ సినిమా పోకిరిలా ఉంటుందని ఇందులో తన పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు చెప్పుకొచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: