కొంతకాలం క్రితం వరకు ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఫంక్షన్స్ జరిగినప్పుడల్లా ఆసినిమా ఫంక్షన్ పవన్ కళ్యాణ్ సినిమా కానప్పటికీ పవన్ నామస్మరణతో జరుగుతూ ఉండేవి. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకులలో కూడ బాలయ్య మ్యానియా పెరిగిపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


‘అఖండ’ విజయాన్ని ఇప్పుడు చాలామంది హీరోలు తమ విజయంగా భావిస్తున్నారు. ఇండస్ట్రీ కూడ ‘అఖండ’ తో కలక్షన్స్ కు ఏర్పడిన కరువు తీరిందని భావిస్తోంది. ఈమూవీని చూడటానికి అమెరికాలో చాలామంది గ్రూప్ బుకింగ్స్ చేసుకుని ‘అఖండ’ ను చూడటానికి వస్తున్నారు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ‘జై బాలయ్య’ నామస్మరణ చేస్తే ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ కూడ జై బాలయ్య నామస్మరణ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈవారం విడుదల కాబోతున్న ‘లక్ష్యం’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన శర్వానంద్ కరోనా భయాలను కూడ పక్కకుపెట్టి జనం ధియేటర్లకు అధికంగా వస్తారు అన్న విషయం ‘అఖండ’ నిరూపించింది అంటు ఆమూవీ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఉత్సాహంగా ‘జై బాలయ్య’ నినాదం చేసాడు.


ప్రస్తుతం వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాగశౌర్య కు ఒక హిట్ కావాలి. ‘వరుడు కావాలి’ తరువాత అనేక కష్టాలలోకి వెళ్ళిపోయిన నాగశౌర్య ఈమూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. టాప్ మిడిల్ రేంజ్ హీరోల లిస్టులో చేరాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ యంగ్ హీరోకు అదృష్టం కలిసి రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ‘లక్ష్యం’ ఈ హీరోకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ‘అఖండ’ జోష్ లో ఉంది ఇలాంటి పరిస్థితులలో నాగశౌర్య సినిమా కూడ హిట్ అయితే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి పండుగే అనుకోవాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: