ఈ మధ్య సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ కు ఎక్కువ క్రేజ్ వస్తోంది. కొందరు సీరియల్ నటీ నటులు వెండి తెరపై ఛాన్సులు దక్కించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మౌనరాగం సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక జైన్ తన మౌనం తోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఒక్క సీరియల్ తోనే చాలా ఫేమస్ అయ్యింది. ఈమె సొంత ఊరు ముంబై. ప్రస్తుతం ప్రియాంక 'జానకి కలగనలేదు' సీరియల్ లో నటిస్తోంది. ఒకప్పుడు మా టివిలో ప్రసారమైన హిందీ డబ్బింగ్ ధారావాహిక 'ఈతరం ఇల్లాలు' స్టోరీని ఇపుడు కొద్దిగా మార్పులు చేసి తెలుగులో 'జానకి కలగలేదు' అనే పేరుతో అనువదించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న టాప్ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయింది ప్రియాంక జైన్. అయితే ఈమెకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అక్కినేని నాగార్జున చేయబోతున్న తదుపరి చిత్రంలో సిస్టర్ క్యారెక్టర్ కోసం ఈ ముంబై బ్యూటీని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక జైన్ కి సినిమాల్లో నటించడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో ఈమె  గోలీసోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది.

అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంక జైన్ తెలుగులో నటించే అవకాశం వస్తే అక్కినేని నాగార్జున సినిమాలో నటించాలని ఉంది అని అన్నారు ప్రియ.  ప్రస్తుతం బంగార్రాజు మూవీ తర్వాత రానున్న సినిమాలో ఈమెకు అవకాశం వచ్చిందట. మరి ఇపుడు ఆమె కల నిజంగా నిజమయ్యిందో లేదో తెలియాల్సి ఉంది. ముంబై నుండి వచ్చినా తెలుగు లో గడగడ మాట్లాడగలరు ప్రియాంక జైన్. ఈ వార్త గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: