నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా,  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీ న థియేటర్ లలో విడుదలయ్యింది. విడుదలకు ముందు ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ,  లెజెండ్ లాంటి రెండు మాస్ బ్లాక్ బస్టర్ లు రావడంతో అఖండ సినిమా పై జనాలు చాలా అంచనాలు పెట్టుకున్నారు, ఆ అంచనాలకు తగినట్లు గానే ప్రస్తుతం అఖండ సినిమా కూడా మంచి మాస్ విజయం వైపు దూసుకుపోతోంది.

 ఇలా తెలుగు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బాస్టర్ విజయం వైపు దూసుకుపోతున్న అఖండ సినిమా పై బాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యాయి, అందులో చాలా వరకు విజయం సాధించడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకున్న అఖండ సినిమా ను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అఖండ రీమేక్ హక్కు లను దక్కించుకునేందుకు అక్కడి భారీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే అఖండ రీమేక్ లో అజయ్ దేవగన్ కానీ,  అక్షయ్ కుమార్ కానీ నటించే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే అజయ్ దేవ్ గన్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే అక్షయ్ కుమార్ కూడా పలు సినిమా లతో బిజీ గా ఉన్నాడు, మరి ఇప్పటి వరకు అఖండ సినిమా బాలీవుడ్ రీమేక్ విషయ మై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: