ఇక ఇటీవల ఈ ఏడాది కూడా హీరో సూర్య ఒక అదిరి పోయే బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. చంద్రు అనే లాయర్ కెరియర్లో ఎదురైన ఒక విభిన్నమైన కేస్ ఆధారం గా తెరకెక్కిన జై భీమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. గిరిజనుల బ్రతుకులు ఎంత దారుణంగా ఉండేవి ఎంతటి వివక్షకు గురయ్యారు అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు.
ఇక ఈ సినిమా ఒక సాదా సీదా సినిమా గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్ లో కాకుండా ఓటిటీ వేదికగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా అటు ప్రేక్షకుల పై ఎంతగానో ప్రభావం చూపింది అని చెప్పాలి. ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. గిరిజనులు ఇంతటి దారుణ మైన వివక్షను ఎదుర్కొంటున్నారా అని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేల చేసింది. ఇలా జై భీమ్ సినిమా ఒకవైపు హీరో సూర్యకు మంచి విజయాన్ని అందించడమే కాదు మరోవైపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు మనసును కదిలించి సూర్యను అభిమానించేలా చేసింది. జై భీమ్ సినిమాలో లాయర్ చంద్రు పాత్రలో సూర్య నటన పాత్రకు ప్రాణం పోసింది అని చెప్పాలి.