మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, జగపతి బాబు,పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో తన నట విశ్వరూపం,థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.ఇక సినిమాలో చూపించిన కొన్ని సీన్లు,సినిమాని ముగించిన విధానం వంటివి చూస్తుంటే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందనే ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు.ఈ సినిమా క్లైమాక్స్ లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి.ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలను అన్ని తెంచుకొని వెళ్ళిపోతాడు.కానీ వెళ్లే ముందు సినిమాలో తన తమ్ముడు అయిన మరో బాలకృష్ణ కూతురుకి మాట ఇస్తాడు.'నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను'అని చెబుతాడు.ఈ క్రమంలోనే సీక్వెల్ తెరకెక్కిస్తే..ఈ మాట ఆధారంగా పాపకు మరో రావడం ద్వారా అఖండ మళ్ళీ వెనక్కి వస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఇక మరోవైపు సినిమా స్టార్ట్ అయిన వెంటనే పసికందుగా ఉన్న బాలకృష్ణ కాశీ చేరతాడు. మరి శివుడు దగ్గర చేరిన తర్వాత బాలకృష్ణ ఎక్కడ? ఎవరి దగ్గర పెరుగుతాడు? లాంటి అంశాలను కూడా ఈ సీక్వెల్లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సినిమాలో బాలకృష్ణ ఒక అఘోర బ్యాచ్ ని వెంటాడి మరీ చంపేస్తాడు. ఈ సినిమాలో బాలయ్య అఘోర కర్తవ్యం జీర్ణావస్థలో ఉన్న పాడుబడ్డ గుహలను బాగు చేయడం, మళ్లీ ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడం వంటివి చూపించారు. ఈ క్రమంలోనే అఖండ కు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అందుకే ఆ అఘోరాలను బాలయ్య చంపాడా? అనేది కూడా ఈ సీక్వెల్లో చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఇక త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: