ఏ మాట కా మాట రెండేళ్ల నుంచి తెలుగు సినిమా పరిశ్రమ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొంతమంది స్టార్ హీరోలు కూడా సినిమాలను విడుదల చేసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సాధించిన చిరంజీవి కూడా తన సినిమా విడుదల చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించడం అదేవిధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో కూడా వెనకడుగు వేయడం ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమను కాస్త ఆశ్చర్యం లో పడేస్తుంది. చిరంజీవి ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఆలోచించి ఫిబ్రవరి వరకు విడుదల చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు.

అయితే బాలకృష్ణ నటించిన రెండో సినిమా విడుదలైన నేపథ్యంలో కాస్త సినిమాను ముందుగానే విడుదల చేసే విధంగా చిరంజీవి ప్లాన్ చేస్తున్నారని జనవరి 26 కానుకగా ఈ సినిమాను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య అనే సినిమాను జనవరి 26న విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ మాట. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోయినా త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని కృష్ణా నగర్ వర్గాలంటున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేస్తూ ఆ సినిమాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసే విధంగా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. అయితే బాలకృష్ణ సినిమా ఆయనలో కాస్త జోష్ నింపింది అని ఆ సినిమాను కూడా వేసవిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారా మీరు వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే చిరంజీవి తన సినిమాను ముందుగా విడుదల చేయాలనుకోవడం మాత్రం అభిమానులను కాస్త ఉత్సాహపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: