టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రాణా ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశం నిర్మిస్తున్న ఈ సినిమాని యువ దర్శకుడు సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాలో నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. మురళీశర్మ, రాజేంద్రప్రసాద్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించబోతున్నానే వార్త ఇప్పుడు విశేషంగా మారింది.

ఇటీవల ప్రముఖ బుల్లితెర టీవీ ఛానల్లో ప్రసారమైన ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న బ్రహ్మానందం ఈ విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశారు.అలాగే సినిమా నిర్మాతలు కూడా అదే విషయాన్ని డిక్లేర్ చేస్తూ పోలీస్ గెటప్ లో ఉన్న బ్రహ్మానందం పోస్టర్ ను కూడా విడుదల చేసారు.దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.మలయాళంలో వచ్చిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి ఇది తెలుగు రిమేక్ గా రూపొందుతుంది.నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో ఎలాంటి కామెడీ క్యారెక్టర్స్ ఉండవు.సినిమా అంతా కూడా చాలా సీరియస్ మోడ్ లోనే ఉంటుంది.

అందుకే తెలుగు వెర్షన్ లో కూడా బ్రహ్మానందం పాత్ర సీరియస్ గా ఉంటుందని అంటున్నారు.అయితే మరోవైపు ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తుండటంతో..సినిమాలో బ్రహ్మానందం కోసం ఆయన ప్రత్యేకంగా ఓ పాత్రను సృష్టించి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.మరి సినిమాలో బ్రహ్మీ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు, పాటలు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా ట్రైలర్ ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: