నటసింహ నందమూరి బాలకృష్ణ మొదటి సారి హోస్ట్ గా మారి ప్రముఖ ఓటీటీ ఆ హలో 'అన్ స్టాపబుల్' అనే టాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో లో బాలయ్య తనదైన హోస్టింగ్ తో ఆదరగొట్టేస్తున్నాడు. ఈ టాక్ షో లో మొదటి ఎపిసోడ్ లో భాగంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, రెండవ ఎపిసోడ్ కి నాచురల్ స్టార్ నాని, మూడవ ఎపిసోడ్ కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక తాజాగా నాలుగవ ఎపిసోడ్ కి అఖండ సినిమా యూనిట్ రాగా.. 5వ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్య షో లో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది.

 ఆహాలో అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలయ్య టాక్ షోలో సందడి చేయడానికి రాబోతున్నాడట. ఇప్పటికే ఈ టాక్ షో నుండి ప్రభాస్ కి ఆహ్వానం అందగా.. ఆయన వెంటనే ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాలయ్య, ప్రభాస్ లకు సంబంధించిన ఎపిసోడ్ని త్వరలోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం వినిపిస్తోంది. మరి బాలయ్య షో కి ప్రభాస్ వస్తే కచ్చితంగా ఆ ఎపిసోడ్ టిఆర్పి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ వార్తకు సంబంధించిన..

అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని ఆహా టీం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు విశేష స్పందన లభించింది. యువి క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు కృష్ణంరాజు సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: