టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో అగ్రహీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. కేవలం కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడమే కానీ గ్లామర్ రోల్స్ అంటే నిత్యామీనన్ ఎప్పుడూ దూరంగానే ఉంటూ వస్తోంది. ఇక ఇటీవల టాలీవుడ్లో ఈ భామ తన సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. తాజాగా విడుదలైన స్కైలాబ్ సినిమాతో ఏకంగా నిర్మాతగా కూడా మారింది నిత్యా మీనన్. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యామీనన్ మొదటిసారి కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గురించి నిత్యమీనన్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక ఇంటర్వ్యూలో నిత్య మాట్లాడుతూ.." నా అంతట నేను ఎవరి దగ్గర అవకాశాల కోసం నిలబడను. ఒక పాత్రకు నేను సరిపోతానని అనుకునేవారు నా దగ్గరికి వచ్చి అడుగుతారు. ఇక భీమ్లా నాయక్ సినిమా అవకాశం కూడా నాకు అలా వచ్చిందే. త్రివిక్రం గారు నాకు ముందు నుంచే తెలుసు. నన్ను ఆయన ఒక రౌడీ అమ్మాయిలా చూస్తాడు. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా పాత్ర ను అలా డిజైన్ చేశాడు.

ఇక ఇప్పుడు నేను నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఒక రౌడి అమ్మాయిగానే కనిపిస్తాను" అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్.. ఇక ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో నిత్యామీనన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ తెలుగులో మాత్రం ఆమె పాత్రను కాస్త పొడిగించి కథలో ప్రాధాన్యమున్న పాత్రగా మలిచారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఈ పాత్ర నచ్చి నిత్యామీనన్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇక సినిమాలో దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తున్నాడు. అతని సరసన సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, సముద్రఖని, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: