అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మూడవ చిత్రం 'పుష్ప' అని అందరికి తెలుసు. 'రంగస్థలం' లానే ఈ చిత్రానికి కూడా క్యాస్టింగ్ కు పెద్ద పీట వేసాడట దర్శకుడు సుకుమార్.

అల్లు అర్జున్ మరియు రష్మిక,ఫహాద్ ఫాజిల్ తో పాటు కన్నడ నటుడు ధనుంజయ్ మరియు సునీల్, అనసూయ, అజయ్ ఘోష్‌ అలాగే అజయ్, రావు రమేష్ ఇలా చాలా మంది నటీనటులు ట్రైలర్లో కనిపించారని తెలుస్తుంది.అయితే అందరికంటే ఎక్కువగా అనసూయ లుక్ బాగా వైరల్ అవుతుందని సమాచారం. నోట్లో బ్లేడు పెట్టుకుని మంగళం శ్రీను పాత్రని పోషిస్తున్న సునీల్ ను ఆమె బెదిరిస్తున్న విజువల్ ట్రైలర్లో ఉందని సమాచారం.

దాంతో అసలు ఈ సినిమాలో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి సర్వత్రా నడుస్తుందని సమాచారం.అయితే కొన్ని కథనాల ప్రకారం అనసూయ దాక్షాయణి అనే నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చాలా భయంకరంగా కనిపిస్తుందని సమాచారం.. అమ్మోరు స్టైల్లో పెద్ద బొట్టుతో అలాగే చేతికి ఉంగరాలు మరియు మెడలో నగలు వేసుకుని నోట్లో కిళ్ళీ గట్టిగా అరుస్తూ పెత్తనం చలాయించే ఓ పెద్దింటి మహిళగా అనసూయ కనిపించబోతుందని సమాచారం..కొంచెం ఈ పాత్ర 'నిజం' సినిమాలో రాశి పాత్రని పోలి ఉంటుందని కూడా తెలుస్తుందని సమాచారం..

అయితే ఆమె పాత్రకి సంబంధించి ఓ ట్విస్ట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.ఆ సీన్ కు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయమని తెలుస్తుంది.ఇప్పటివరకు గ్లామర్ గా కనిపించిన అనసూయ  ఇలాంటి క్రూరమైన పాత్రలో ఎలా నటించబోతుందని అనేది తెలియాలంటే డిసెంబర్ 17 'పుష్ప ది రైజ్' విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందేనని తెలుస్తుంది.అల్లు అర్జున్ ఈ సినిమాలో ఊర నాటు లుక్ కనిపించి మెప్పించారని తెలుస్తుంది. ఆ పాత్ర ఎంతో పాపులర్ అవుతుందని అల్లుఅర్జున్ అభిమానులు అనుకుంటున్నారట... మరి చూడాలి ఏ విధంగా విజయం సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: