వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న చిరంజీవి వచ్చే ఏడాది కనీసం మూడు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. యంగ్ డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. చిరంజీవి భవిష్యత్తు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీరాజ్ కు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే సంగతి తెలిసిందే.

రాజకీయాల పరంగా పృథ్వీరాజ్ వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో పృథ్వీరాజ్ జనసేన పార్టీపై, మెగా ఫ్యామిలీపై విమర్శలు చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీపై తాను విమర్శలు చేసినా చిరంజీవి తనను రికమెండ్ చేశారని పృథ్వీ పేర్కొన్నారు. తాజాగా చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను పృథ్వీ షేర్ చేశారు. 'అన్నయ్యతో తమ్ముడు' అనే క్యాప్షన్ తో పృథ్వీ షేర్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.రాజకీయాలలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.అలాగే పృద్విరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ విషయంలో మెగా ఫ్యామిలీ కొద్దిగా సీరియస్ అయిందని తెలుస్తుంది.అయినా కూడా చిరంజీవి అవేమి మనస్సులో పెట్టుకోకుండా పృద్విరాజ్ కు మంచి అవకాశం వచ్చేలా చేసారని తెలుస్తుంది.

 

పృథ్వీరాజ్ కు అవకాశాలు తగ్గడంతో చిరంజీవి గుర్తుకువచ్చాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి మనస్సు మంచిదని విమర్శలు చేసిన వాళ్లను కూడా క్షమించే గొప్ప హృదయం చిరంజీవికి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పృథ్వీరాజ్ కు అవకాశాలు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ విలువను తెలుసుకోవాలని పృథ్వీరాజ్ కు నెటిజన్లు సూచిస్తున్నారుఇంకోసారి కనుక మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఇండస్ట్రీలో నే లేకుండా చేస్తామని చాలా మంది ఆయనను హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: