అయితే ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం రేటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ షో చూడటానికి అందరు ఆసక్తి కనపరిచారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు మధ్య జరిగిన సంభాషణలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.
కృష్ణ గారు ఎంత పెద్ద ఫుడి అందరికీ తెలుసు.. మీరు కూడా ఎప్పుడైనా మీ నాన్న గారి లాగా ప్రయత్నించారా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించాడు. అవును ఆయనలాగా తినడానికి ప్రయత్నించి ఏకంగా 105కిలోలు అయ్యాను అంటూ మహేష్ బాబు అన్నాడు. అయితే తనకు అమ్మమ్మ వంటలు అంటే ఎంతో ఇష్టం అంటూ తెలిపాడు మహేష్ బాబు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆ వంటలను ఎంతగానో మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఉప్పు కారం లేకుండా ఏవో తినాల్సి వస్తుంది అంటూ తెలిపాడు. అయితే ఇప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటూ ప్రశ్నించగా.. బిర్యానీ అంటూ చెప్పాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.