ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గా తెలియజేసింది శ్రియ. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో అని చాలా బిజీగా ఉన్నది. శ్రియ మాట్లాడుతూ..నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతోందంటే నమ్మబుద్ధి కావడం లేదు.. నన్ను ఇంతలా ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసింది. ఎన్ని సంవత్సరాలు నేను ఎన్నో సినిమాలలో నటించానని తెలిపింది.
అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి మరికొన్ని సినిమాలు పరాజయాన్ని చూశాయి. ఎలాంటి సమయంలోనైనా కూడా నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం కాలేదు.. కేవలం నా దగ్గరకు వచ్చిన కథల నాకు నచ్చిన పాత్ర ఉంటేనే చేస్తాను.. ఇక కరోనా వచ్చినప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉండి పోయాను అని తెలియజేసింది.
తను నటనకి దూరం కాలేనని తెలియజేసింది శ్రియ . ఈ విషయంలో నాకు ఆదర్శం గా అక్కినేని కుటుంబమే అని తెలియజేసింది. వారి ఇంట్లో ANR తన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తానని తెలియజేశారని చెప్పుకొచ్చింది. అందుచేతనే ఆయన చివరి సమయంలో కూడా నటించారని తెలియజేసింది.వారి కుటుంబంలో అందరి నటన బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. నేను కూడా ANR చెప్పిన మాటలను పాటిస్తూ నా చివరి నిమిషం వరకు నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. గమనం సినిమాలో తనకు ఒక ప్రత్యేకమైనదిగా ఉండబోతోంది అన్నట్లుగా తెలియజేసింది.