టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. అల వైకుంఠపురం లో వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు రంగస్థలం వంటి హిట్ తర్వాత సుకుమార్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు  విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టి సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేర్చాయి.

ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్1: పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ముత్తం శెట్టి మీడియా తో కలిసి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే అఖండ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకే కొత్త ఆశలు పుట్టించింది. ఇప్పుడు అదే బాటలో పుష్ప సినిమా కూడా టాలీవుడ్ కు మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రన్ టైం విషయంలో చిత్ర యూనిట్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు సమాచారం వినిపిస్తోంది.

సినిమా నిడివి సుమారు 3 గంటల 4 నిమిషాల వరకు ఉంటుందట. ఇక థియేటర్లలో వచ్చే యాడ్స్ తో కలిపి చూసుకుంటే సుమారు మూడున్నర గంటలు ఈ సినిమా ఉండబోతోందట. ఇక సుకుమార్ తెరకెక్కించిన గత చిత్రం రంగస్థలం సినిమా కూడా మూడు గంటలకు పై నిడివితో ఉంటుంది. అయినప్పటికీ ఆ సినిమాకి అది పెద్ద మైనస్ కాలేదు. ఇక పుష్ప విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందా లేక ఈ సినిమాకి రన్ టైం మైనస్ గా మారుతుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా సమంత ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: