మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా ల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీ న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను కూడా  చక చక పూర్తి చేస్తున్నాడు, ఈ రెండు సినిమా లతో పాటు చిరంజీవి తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్సినిమా లో కూడా హీరో గా నటిస్తున్నాడు.  ఈ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండ గా తమన్నా, చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది, చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో చిరంజీవి కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తోంది.

అయితే తాజా గా ఈ సినిమా కు సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదిక గా తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడంతో ఒక స్టైలిష్ ఫైట్ ను పూర్తి చేశాము అని, అలాగే ఒక భారీ సెట్ లో ఒక పాట ను కూడా పూర్తి చేసినట్లు తెలియజేశారు.  సెట్లో దర్శకుడు మెహర్ రమేష్ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కు సూచనలిస్తున్న ఓ ఫొటో ని షేర్ చేసిన బోలా శంకర చిత్ర బృందం సెకండ్ షెడ్యూల్ ని కూడా ఇప్పటికే ప్రారంభించేశామని వెల్లడించింది. చిరంజీవిసినిమా తో పాటు బాబి దర్శకత్వం లో మైత్రి మూ వీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న  సినిమా లో కూడా హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: