బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా అఖండ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయి టాక్ ని అయితే సొంతం చేసుకోలేకపోయింది. సినిమాలో వయొలెన్స్ ఎక్కువయిందని, అలానే బోయపాటి కథ కంటే ఎక్కువగా మాస్ ఎలివేషన్ అంశాలు, హీరోయిజం పైనే దృష్టిపెట్టారు అంటూ పలువురు ప్రేక్షకులు మూవీ పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే టాక్ తో సంబందం లేకుండా ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా అఖండ సినిమా బాగానే కలెక్షన్స్ రాబడుతోంది.

నిజానికి సినిమాలో పెద్దగా ఆసక్తికరమైన కంటెంట్ లేనప్పటికీ ,మొత్తంగా సినిమాని తన సింగిల్ హ్యాండ్ తో రెండు పాత్రల్లో కూడా ఎంతో అద్భుతంగా నటించి ముందుకు నడిపించారు బాలయ్య. ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు కూడా పదే పదే సినిమా చూస్తుండడంతో అఖండ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య నభూతో నభవిష్యతి అనే స్థాయిలో అదరగొట్టారు. బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తీసిన ఈ సినిమా విజయోత్సవ వేడుకని రేపు విశాఖపట్నంలోని ఎం జి ఎం గ్రౌండ్స్ ఉడా పార్క్ వద్ద నిర్వహించనుంది యూనిట్. ఇప్పటికే అక్కడ వేడుకకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం దర్శకుడు బోయపాటి, హీరో బాలయ్య విశాఖ చేరుకోగా నేడు రాత్రి సినిమాకి సంబందించిన ఇతర యూనిట్ సభ్యులు కూడా అక్కడికి చేరుకోనుండగా, ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా యాక్ట్ చేయగా, ఇతర పాత్రల్లో జగపతి బాబు, సుబ్బరాజు, ప్రభాకర్, పూర్ణ, నితిన్ మెహతా తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: