ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరు, క్రేజ్ దక్కించుకుని దూసుకెళ్తున్నారు ఎస్ ఎస్ థమన్. తొలిసారిగా టాలీవుడ్ కి భీభత్సం అనే మూవీ ద్వారా సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన థమన్, అంతకముందు శంకర్ తీసిన బాయ్స్ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేసాడు. అయితే ఆ తరువాత మ్యూజిక్ మీద మరింతగా శ్రద్ధ పెట్టి తన కెరీర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా మొదలెట్టిన తమన్ ఆపైన వరుసగా తన టాలెంట్ తో అనేక అవకాశాలు అందుకున్నారు.
ఇక ఇటీవల అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురములో మూవీతో భారీ సక్సెస్ కొట్టి, అందులోని సాంగ్స్ తో అటు నార్త్ ప్రేక్షకులని కూడా ఎంతో ఆకట్టుకున్న థమన్ కు ప్రస్తుతం పలు భారీ సినిమాల ఛాన్స్ లు వరుసగా వస్తున్నాయి. ఇక ఇటీవల రవితేజ తో క్రాక్, పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్, ప్రస్తుతం మంచి పేరు దక్కించుకున్న బాలయ్య నటించిన అఖండ వంటి సినిమాలకు అద్భుతమైన సాంగ్స్ అందించిన థమన్, లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, రానా కలిసి యాక్ట్ చేస్తున్న భీమ్లా నాయక్ తో పాటు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇప్పటికే భీమ్లా నాయక్ నుండి విడుదలైన పలు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా జనవరిలో సర్కారు వారి పాట సాంగ్స్ కూడా రిలీజ్ కానున్నాయని, ప్రస్తుతం తన కెరీర్ కి ఎంతో ముఖ్యమైన ఈ రెండు సినిమాలు కూడా అటు సాంగ్స్ పరంగానే కాక ఇటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టడం, ఆయా హీరోల ఫ్యాన్స్ ని తెలుగు ప్రేక్షకులని అలరించడం ఖాయం అంటూ ఇటీవల పలు ఇంటర్వ్యూ ల్లో భాగంగా థమన్ వెల్లడించారు. కాగా భీమ్లా నాయక్ జనవరి 12, అలానే సర్కారు వారి పాట ఏప్రిల్ 1న రిలీజ్ కానున్నాయి.  
 


 

 



 

మరింత సమాచారం తెలుసుకోండి: