అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా బుచ్చి బాబు సన దర్శకత్వం లో తెరకెక్కిన ఉప్పెన  సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటన కు, అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం తో ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో అదిరి పోయే సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందు లో భాగం గా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సోగ్గాడే చిన్నినాయన సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు శ్యామ్ సింగ రాయ్, మాచర్ల నియోజక వర్గం, రామ్ పోతినేని హీరో గా తెరకెక్కుతున్న ఒక సినిమా లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ లోనే ఫుల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఇలా ఇప్పటికే వరుస సినిమా లతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ ముద్దు గుమ్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి కమర్షియల్ ఈ సినిమా ను కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమా ను ఈ ముద్దుగుమ్మ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాకు రాజ్‌ తరుణ్‌ తో ‘ఉయ్యాల జంపాల’, నానీ తో ‘మజ్ను’ చిత్రాలు తెరకెక్కించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట, ఈ సినిమా ను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మించనున్నారని సమాచారం.  ఇలా కెరియర్ ప్రారంభం లోనే ఈ ముద్దు గుమ్మ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాముఖ్యతను ఇస్తూ మిగతా హీరోయిన్ లకు గట్టి పోటీని ఇస్తోంది. ఇది ఇలా ఉంటే కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా డిసెంబర్ 24 వ తేదీ న విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: