పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కొండపొలం,  ఈ సినిమా దసరా  సందర్భం గా అక్టోబర్ 8 వ తేదీ న థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా థియేటర్ ల దగ్గర ప్రేక్షకుల నుండి పెద్ద గా ఆదరణ ను పొందే లేక పోయినప్పటికీ, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారం గా ఈ సినిమాను  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించాడు. ఇంజనీరింగ్‌ చదివిన ఓ యువకుడు పట్టణం లో ఉద్యోగం తెచ్చు కోలేక ఇంటి కి తిరిగి రావడం, భయపడు తూనే కొండ పొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటన లతో మానసికంగా ఎలా బలం గా మారాడు.? యూ పీ ఎ స్సీ పరీక్షల్లో ఐ ఎఫ్‌ ఎస్‌ కు ఎలా ఎంపికయ్యాడన్నదే కొండ పొలం సినిమా కథ.

అయితే థియేటర్ లలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓ టి టి లో కి వస్తుందా .?  ఎప్పుడు చూద్దామా అని అనేక మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అయితే తాజా గా  పెద్దగా ప్రచారం లేకుండానే కొండా పొలం సినిమా ఓ టి టి లో విడుదల అయ్యింది. అయితే ఎవరైనా ఈ సినిమా పై ఆసక్తి ఉండి థియేటర్ లలో చూడని వారు ఓ టి టి లో ఈ సినిమా ను చూసి ఆనందించండి. కొండ పొలం సినిమా ప్రముఖ ఓ టి టి  ప్లాట్‌ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది ఇలా ఉంటే పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: