చిరంజీవి కూతురిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, కాస్ట్యూమ్ డిజైనర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ ద్వారా విలక్షణమైన కథలను ఎంచుకుని, అంతే విలక్షణంగా తెరకెక్కించి, ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ సంస్థ ను సుస్మిత కొణిదల ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే సుష్మిత ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది, పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా తెరకెక్కిన ఉప్పెన సినిమా లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కృతి శెట్టి తో సుస్మిత ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  

లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం  కృతి శెట్టి ని సంప్రదించగా ఈ ముద్దు గుమ్మ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏ నిర్మాత అయిన ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెకించలే అంటే ఆ హీరోయిన్ గత సినిమాల నటనను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు, అయితే కేవలం ఒకే ఒక సినిమాలో నటించిన కృతి శెట్టి పై ఎంతో నమ్మకంతో సుష్మిత, కృతి శెట్టి కి ఈ అవకాశం ఇవ్వడం చాలా డేరింగ్ డెసిషన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌ తరుణ్‌ తో 'ఉయ్యాల జంపాల', నాని తో 'మజ్ను' చిత్రాలను రూపొందించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి నాని హీరో గా తెరకెక్కుతున్న సింగ రాయ్ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా డిసెంబర్ 24 వ తేది న విడుదల కాబోతుంది.  ఈ సినిమా లతో పాటు మాచర్ల నియోజకవర్గం, బంగార్రాజు, రామ్ పోతినేని సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: