తెలుగులో ఈ మధ్య కాలంలో కొంత మంది అగ్ర హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో కాస్త ఆసక్తికర చర్చలు టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది ప్రముఖ హీరోలు ఇప్పుడు వరుసగా సినిమాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ కూడా షాక్ అవుతుంది. టాలీవుడ్ లో చాలా వరకు కూడా అగ్ర హీరోలు తమ సినిమాల్లో లైన్లో పెట్టు కోవడం అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమా కావడంతో అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అటు బాలీవుడ్ కూడా ఆసక్తికరంగా గమనిస్తోంది.


దేశవ్యాప్తంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నా సరే తెలుగు సినిమా వెనక్కు తగ్గక పోవడం పట్ల కాస్త కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తూ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక మన హీరోలు వరుసగా సినిమాలు విడుదల చేయడానికి సిద్ధం కావడంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలు చేసేందుకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.



వచ్చే ఏడాది జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రెండు సినిమాలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జనవరిలో రాజమౌళి దర్శకత్వంలో సినిమాను విడుదల చేయగా దసరాకు మరో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. రాబోయే రెండేళ్లలో కనీసం మూడు సినిమాలి అయినా సరే విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా జూనియర్ ఎన్టీ ఆర్ నుంచి రానుందని ఒక ప్రముఖ దర్శకుడితో సినిమాలు వేగంగా పూర్తి చేసి ఆది విడుదల చేసిన వెంటనే మరో సినిమా సెట్స్ మీదకు  తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట అని అంటున్నారు.దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: