బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. ఇక బాలయ్యని ఈ సినిమాలో మునుపెన్నడు చూపించని విధంగా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాలో ఫ్యాక్షనిస్ట్, అఘోర రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం తో విజృంభించాడు. ఇక సామాన్యుల తో పాటు ఈ సినిమా సినీ సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

 కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు అఖండ కొత్త ధైర్యాన్ని నింపింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా మాస్ జాతరను కంటిన్యూ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..' ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాన్ని అఖండ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో చూపించిన విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని కళ్లకు కట్టినట్టు అఖండ సినిమాలో చూపించారని' అన్నారు చంద్రబాబు.

అంతేకాకుండా అఖండ సినిమా కూడా చాలా బాగుంది అని ఆయన కొనియాడారు. ఇక చిత్ర యూనిట్ కి కూడా తన అభినందనలు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం అఖండ సినిమా పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ప్రస్తుతం ధియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించగా జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కెరీర్లోనే తక్కువ సమయంలో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా అఖండ సరికొత్త రికార్డును నెలకొల్పింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: