టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు గా తమ సత్తా చాటుకున్నారు అనుష్క మరియు సమంత. వీరిద్దరు కూడా ఒకే సమయంలో సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తమదైన నటనతో తమాడైన అభినయంతో గ్లామర్తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ విధంగా కోట్లాది మంది అభిమానులను ఏర్పరుచుకుని వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించి భారీస్థాయిలో పాపులారిటీని దక్కించుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో అనుకున్న స్థాయిలో ఫామ్ లో లేరనే చెప్పాలి. కొత్త హీరోయిన్ లు రావడంతో అనుష్క మరియు సమంత లకు గతంలో ఉన్న స్థాయి లో సినిమా అవకాశాలు కరువయ్యాయి.

టాప్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క దాదాపు టాలీవుడ్ లో కనుమరుగైపోయింది అనే చెప్పాలి. మెల్ల మెల్లగా సినిమాలకు కూడా దూరం అయిపోతుంది. ఇటు సమంత కూడా ఇప్పుడు పెద్ద గా సినిమా అవకాశాలు అందుకోవడం లేదు. విడాకుల తర్వాత సినిమా అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది ఈమె. ఆ విధంగా ఇప్పుడు ఆమె చేతిలో రెండు భారీ సినిమాలు తెలుగు లో రాబోతున్నాయి. వాటిలో ఒక సినిమాకు సంబంధించిన షూటింగ్ తేదీ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక రెండవ సినిమా యశోద త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతుంది. ఈ చిత్రంపై సమంత భారీ హోప్స్ పెట్టుకుంది.

అయితే ఈ సినిమాలో కథానాయకుడిగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో అనుష్క తో కలిసి ఈ హీరో భాగమతి అనే సినిమాలో చేయగా ఇప్పుడు సమంత సరసన ఓ సినిమాలో చేయడం విశేషం. ఆ విధంగా ఇద్దరు టాప్ హీరోయిన్లతో నటించిన  మలయాళ నటుడు గా ఈ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు. తెలుగులో జనతా గ్యారేజ్ అనే సినిమాలో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మరి ఈ సినిమా సమంత కు ఎంత ముఖ్యమో ముకుందన్ కూడా తెలుగులో నిలదొక్కుకోవడానికి కూడా అంతే ముఖ్యం. మరి దీనికి ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: