రెండు దశాబ్దాల ఎదురు చూపులకు 21 ఏళ్ల యువతి తెర దించింది. ప్రతిసారి పోటీపడటం నిరాశ చెందడమే సరిపెట్టుకున్న భారత్కు ఇక అరుదైన గౌరవం దక్కింది. 20 సంవత్సరాల తర్వాత భారత్కు మరో సారి మిస్ యూనివర్స్ కిరీటం వరించింది. పంజాబ్కు చెందిన 21 ఏళ్ల అమ్మాయి హర్నాథ్ సందు  మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా మిస్ యూనివర్స్ పోటీల్లో తలపడిన 80 మంది అందగత్తెలకు వెనక్కి నెట్టి అందంతోనే కాదు తెలివి తో కూడా జడ్జిల మనసుని తలుచుకుంటూ విశ్వసుందరిగా నిలిచింది.


 దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం వరించడంతో ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా హార్నాథ్ కౌర్ సందు పేరు మార్మోగిపోతోంది. ఇటీవల ఇజ్రాయిల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాథ్  సందు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నో ఒత్తిళ్లను ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ఇక్కడకు చేరుకుంది ఇక ఇప్పుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది యువతి. అయితే మిస్ యూనివర్స్ పోటీల్లో ఎంతో మంది అందగత్తెలు ఉన్నప్పటికీ మిస్ యూనివర్స్ కిరీటం మాత్రం ఈ అమ్మడికి దక్కడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి అని చెప్పాలి.


 ముఖ్యంగా ఈ అమ్మడుకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కడానికి హర్నాథ్ సందు చెప్పిన సమాధానాలు కారణం అని చెప్పాలి. ఒత్తిళ్ల మధ్య బ్రతుకుతున్న నేటి యువతులకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అని ప్రశ్నించగా అద్భుతమైన సమాధానం చెప్పింది హర్నాథ్ సందు. ఈ రోజుల్లో యువత ఒత్తిడికి లోనవ్వడానికి కారణం తమని తాము నమ్మకపోవడం. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. మీ కోసం మీరు మాట్లాడండి. మీ జీవితానికి మీరే లీడర్.. నన్ను నేను నమ్ముకున్న అందుకే  ఇక ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు నిలుచున్నాను అంటూ సమాధానం చెప్పడంతో ఇక మిస్ యూనివర్స్ స్టేజ్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.. ఈ ఒక్క సమాధానంతో జడ్జీల మనుసు గెలుచుకుంది ఈ యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి: