టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న సమంత అని అందరికి తెలుసు.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోందట.. తన విడాకులు, 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ మరియు నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలు ఇలా పలు కారణాల వలన ఆమెకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉందని తెలుస్తుంది.

నిన్ననే ఈ బ్యూటీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం కడపకు వెళ్లిందట ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా మాంగల్య షోరూంను ప్రారంభిస్తున్న సందర్భంగా సినీ నటి సమంతను గెస్ట్ గా ఇన్వైట్ చేశారట.

ఆమెని చూడడానికి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారట.దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలుస్తుంది.. అభిమానుల కేరింతల మధ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించిందట సమంత. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చిన సమంత కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురైనట్లు సమాచారం..

తీవ్రమైన జలుబు మరియు వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.. దీంతో ఆమె ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తుంది.డాక్టర్ల సజెషన్ మేరకు.. మెడికేషన్ తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు టెన్షన్ పడుతున్నారట.. ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఫిట్నెస్ తో ఉండే సమంత ఆరోగ్యం చెడిపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారని తెలుస్తుంది..

ఇక సినిమాల విషయానికొస్తే.. 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత రీసెంట్ గా 'యశోద' అనే సినిమాను మొదలుపెట్టిందని తెలుస్తుంది.. హరి మరియు హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వేసవికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. దీంతో పాటు సమంత చేతిలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మరియు ఓ బైలింగ్యువల్ సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: