ప్రస్తుతం తాజాగా చెన్నై లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. ఈ సినిమా యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. చెన్నైలో ఈ ప్రెస్ మీట్ జరిగేటప్పుడు ఒక మీడియా వేత్త.. రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లను ఇద్దరినీ ఉద్దేశించి.. మీరిద్దరూ రాజమౌళితో పని చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది.. ఇక సినిమాలో రాజమౌళిని మెప్పించడానికి షూటింగ్ సమయంలో మీరు ఎలా పని చేశారు.. రాజమౌళి మెప్పు కోసం ఎలాంటి హార్డ్ వర్క్ మీరు చేశారు అని అడగుతూ.. ఇద్దరూ వేరువేరుగా సమాధానం చెబితే చాలా బాగుంటుంది అని అడిగారు..అందుకు ముందుగా రామ్ చరణ్.. రాజమౌళి తో పని చేసేటప్పుడు మేము మాత్రమే కాదు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా చాలెంజ్ గా తీసుకుని నటిస్తూ ఉంటారు.
చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవడమే కాకుండా ఆ పాత్రలను తమ కోసమే డిజైన్ చేశారు అన్నట్టుగా లీనమైపోయి నటిస్తూ ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు పాత్రలను వివరిస్తూ వస్తూ ఉంటారు. ఏ సందర్భంలో ఎలాంటి హావభావాలు పలకాలో అని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా దగ్గరుండి జాగ్రత్తగా మాతో చేయించారు.. ఆయనతో జర్నీ చాలా స్మూత్ గా సాగింది అని రామ్ చరణ్ వివరణ ఇచ్చారు.
ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ లో ఉండే అతి కొద్దిమంది టాలెంటెడ్ దర్శకులలో రాజమౌళి కూడా ఒకరు . అందుకే ఆయనను మేము జక్కన్నా అని పిలుస్తూ ఉంటాము. చాలా క్యాలిక్యులేటెడ్ పర్సన్. హీరోల లో ఉండే కసిని , పట్టుదల ను ప్రేక్షకులకు చూపిస్తూ ఉంటాడు. ఎంత కొత్త క్యారెక్టర్లో నటించినా ఆయన ఇంకా ఏదో కావాలి.. ఇంకా ఏదో కావాలని.. సరికొత్త అనుభూతిని పొందేవరకు టేక్ తీసుకుంటూనే ఉంటారు. ఆయన నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు.. ముఖ్యంగా భీమ్ పాత్రలో చేయడానికి నేను భయపడ్డా.. ఆయన స్ఫూర్తిని కూడా నింపారు అంటూ వివరణ ఇచ్చారు ఎన్టీఆర్.