యువరత్న బాలకృష్ణ నటించిన సినిమా బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాకు బన్నీ పుష్ప‌ సినిమా థియేటర్ లోకి వచ్చే వరకు బ్రేకులు లేవు. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య అఖండ సినిమా థియేటర్ లోకి వచ్చి అఖండ జ్యోతిలా వెలిగిపోతోంది. అఖండ సినిమాలో బాలయ్యకు తల్లిగా చేసిన ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది. బాలయ్య తల్లి పాత్ర‌ధారి ఎవరు ? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అన్న దానిపై ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

అఖండలో బాలయ్య తల్లిగా చేసిన నటి పేరు వీజీ. చంద్రశేఖర్. ఆమె భర్త ఎయిర్ ఇండియా లో చాలా సీనియర్ మోస్ట్ కెప్టెన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఆయన ఇప్పటికీ ఏయిర్ ఇండియాలోనే పని చేస్తున్నట్టు వీజీ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నెలలో 12 రోజుల కంటే ఎక్కువ పని చేయనని కూడా ఆమె తెలిపారు.

ఇక తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పిన ఆమె... ఒక అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉండటంతో పాటు యాక్టర్‌గా కూడా చేస్తుందని చెప్పారు. మరో అమ్మాయి సైకాలజీ పూర్తిచేసి కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమాలు చేయటం మొదలు పెట్టింది అని అన్నారు. ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లలను సరిగా పెంచుకోవాలని... అది వారి బాధ్యత అని విజీ చంద్రశేఖర్ చెప్పారు. ఇక తన భర్త ఇప్పుడు వీధుల్లో బిజీగా ఉండటంతో అప్పుడు అప్పుడు ఒక గెస్ట్‌గా మాత్రమే ఇంటికి వచ్చి వెళుతూ ఉంటారని ఆమె చెప్పారు.

తన పిల్లల పేరెంట్స్ మీటింగ్స్‌, తమ బంధువుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా తన భర్త హాజరు కార‌ని ఆమె చెప్పింది. అయితే తాను కూడా అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తానని... తన భర్తతో పాటు తాను కూడా వృత్తిపరంగా బిజీ అయిపోతే .... పిల్లలను ఎవరు పట్టించుకుంటారు అని ఆమె చెప్పింది.

ఇక అఖండ సినిమాలో అఖండ పాత్ర తన కుమారుడు అని తెలిసిన తర్వాత ఆమె, అఖండను ఇంటికి రావాలని విజ్ఞప్తి చేస్తూ చెప్పే డైలాగులు మాతృత్వంలో గొప్పతనాన్ని చాటిచెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: