టాలీవుడ్ సినిమా పరిశ్రమలో డైరెక్టర్ గా టాప్ రేంజ్ లోకి దూసుకు పోతున్నాడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా పటాస్ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా తెలుగు హీరోలు అందరూ ఎవరి దర్శకుడు అన్నట్లుగా ఆయన వైపు చూశారు. అయితే పటాస్ సినిమా ఇచ్చిన విజయోత్సాహం ఆయన లో ఎక్కువగా నింపింది. ఆ సినిమా విజయోత్సాహంలో నే తదుపరి సినిమా రవితేజతో కలిసి చేయగా ఆ చిత్రం కూడా భారీగా విజయవంతం అయ్యింది.

ఆ తర్వాత ఎఫ్ 2 మల్టీస్టారర్ సినిమా చేయగా అది కూడా సూపర్ హిట్ కావడంతో పెద్ద హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఆయనకు సరిలేరు నీకెవ్వరు అనే సినిమా అవకాశాన్ని ఇవ్వగా దాన్ని కూడా సూపర్ హిట్ చేసి అపజయం లేని దర్శకుడిగా అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అని ల్. ప్రస్తుతం ఎఫ్2 సినిమాకు సీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు అనిల్. ఈ సినిమా కూడా తప్పకుండా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తపరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం బాలకృష్ణ తో చేయనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టక పోవడం తో అనిల్ రావిపూడి సమయం వృధా చేసుకోవ డం ఇష్టం లేక బాలకృష్ణ తో సినిమా చెయ్యటానికంటే ముందు మరో సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఈలోపు బాలకృష్ణసినిమా పూర్తి చేస్తాడు కాబట్టి తాను కూడా ఈ సినిమాను పూర్తి చేసి మళ్ళీ బాలయ్యతో చేతులు కలపాలని ఆయన నిర్ణయించుకున్నాడట.మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: