హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ బ్యూటీ కీ తెలుగు నాట ఫుల్ క్రేజ్ వచ్చింది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఈ హాట్ బ్యూటీ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండా పొలం సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే తాజా గా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. కథ డిమాండ్ చేస్తే ఆ పాత్ర కోసం ఏదైనా చేస్తాను కానీ, దానికి కూడా నా విషయంలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.  చాలెంజింగ్ పాత్రల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా, వాటి కోసం ఎంత కష్ట పడటానికి సిద్ధంగా ఉంటా కానీ.. బరువు తగ్గడం, పెరగడం చేయమంటే మాత్రం నావల్ల కాదు. ఎందుకంటే అది చాలా సహజంగా జరగాల్సిన ప్రక్రియ. కావాలని బరువు తగ్గిన, పెరిగిన శరీరంపై అది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే తెలిసి తెలిసి నేను అలాంటి తప్పు చేయను, నాకు నా ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. నా అదృష్టం కొద్దీ నా దగ్గరకు వచ్చిన దర్శకులెవరు నాకు అలాంటి కండిషన్స్ పెట్టలేదు, అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: