అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందే మెదులుతూనే ఉన్నాయి. ఈమె తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. శ్రీదేవి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే తాజాగా శ్రీదేవి భర్త  బోనీ కపూర్ ఇంస్టాగ్రామ్ లో చేరారు.

 సోషల్ మీడియాలో చేరినప్పటి నుంచి బోనీ కపూర్ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు, తన కుటుంబ సభ్యులకు సంబందించిన ఫోటోలను పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 18న తన భార్య శ్రీదేవి తో సన్నిహితంగా ఉండే ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో శ్రీదేవి నల్లటి కోటు,కండువా ధరించింది. అలాగే ఈ ఫోటోలో బోనీకపూర్ శ్రీదేవి ఒకరి చేయి ఒకరు పట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. బోనీ కపూర్ ఈ ఫోటోని షేర్ చేస్తూ రెడ్ కలర్ హాట్ ఎమోజీ ని పెట్టి మై హార్ట్ అనే క్యాప్షన్ ని జోడించారు.

 ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో పై శ్రీదేవి,బోనికపూర్ లో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోను చూసిన అభిమానులు  ఉత్తమ జంట, మిస్ యు మేడమ్ ఎప్పటికీ  అంటూ కామెంట్స్ చేశారు. ఇంతకుముందు బోనీ కపూర్ తన మొత్తం  ఫ్యామిలీ ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఆ ఫోటో కి నా బలం అనే క్యాప్షన్ ను ఇచ్చాడు. అలాగే అంతకు ముందు అతను పిల్లల అయినా  అన్షులా ,అర్జున్, జాన్వి, ఖుషి లతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ నా ఆస్తి అనే క్యాప్షన్ ని జోడించారు. 1996లో శ్రీదేవి బోనికపూర్ లు ఒకటి అయిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా, మరొకరు ఖుషి కపూర్. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో జరిగిన ఒక కుటుంబ కార్యక్రమానికి హాజరైన తర్వాత శ్రీదేవి మరణించింది. అప్పట్లో శ్రీదేవి మరణ వార్త  ఇండస్ట్రీని శోక సంద్రంలో ఒక్కసారిగా నెట్టేసింది.    


మరింత సమాచారం తెలుసుకోండి: