బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్‌, రణబీర్ కపూర్‌, అలియాభట్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా టోటల్ గా 3 భాగాలుగా రూపుదిద్దుకుంది. 2022 సెప్టెంబరు 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టడానికి పార్ట్ 1 విడుదల కానుంది. అందుకే దక్షిణాది భాషల్లో ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ విషయాల్లో కూడా రాజమౌళికి కీలక పాత్ర ఉంది. `బ్రహ్మాస్త్ర`సినిమాని ఇండియాలోనే పెద్ద విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.ఇక ఈ ప్రాజెక్టుపై దాదాపుగా 700 కోట్లు భారీ బడ్జెట్ ని వెచ్చిస్తోంది. అందుకే దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో చిత్రబృందం దర్శకధీరుడు రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటోంది.

ఈ చిత్ర ప్రారంభానికి ముందే దర్శకుడు అయాన్ ముఖర్జీ రాజమౌళిని పలు సందర్భాల్లో కలవడం జరిగిందట. ఈ సినిమాని ఎలా ఏ విధంగా తీయాలి? విజువల్ గా ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండాలి? అనే ఆసక్తికర విషయాలపై రాజమౌళి సలహాలు ఇంకా సూచనలు తీసుకున్నాడు. బ్రహ్మాస్త్ర టీమ్ లో కరణ్ జోహార్ రాజమౌళిని లాక్కు రావడం అనేది జరిగింది. అందుకే ఈ సినిమాకి రాజమౌళి ప్రమేయం మరింతగా పెరిగింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఇంకా అందులోని సాంకేతికత ఇవన్నీ కూడా మన జక్కన్న రాజమౌళికి బాగా తెలుసు. అందుకే బ్రహ్మస్త్ర మూవీ టీమ్ మన రాజమౌళి సలహాల్ని అందుకోవడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో రాజమౌళిని కూడా ఓ కీలక భాగస్వామిగా చేర్చింది. దర్శకధీరుడు రాజమౌళి పేరు తమ పోస్టర్ పై ఉండడం తమ అదృష్టమని కరణ్ జోహార్‌ ఇంకా అయాన్ ముఖర్జీ అన్నారంటే జక్కన్న రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో పూర్తిగా మీరు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: